Skip to content
September 17, 2026
  • Facebook
  • Instagram
  • Twitter
  • Youtube
  • Linkedin
www.yuvatelangana.com epaper

www.yuvatelangana.com epaper

www.yuvatelangana.com

Connect with Us

  • Facebook
  • Instagram
  • Twitter
  • Youtube
  • Linkedin
Primary Menu
  • Home
  • Reporters
Watch
  • Home
  • National News
  • నేడు అమరావతికి ప్రధాని మోడీ
  • National News

నేడు అమరావతికి ప్రధాని మోడీ

raam ch May 2, 2025 1 minute read
ccc

హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి రానున్న ప్రధాని మోదీ దాదాపు లక్ష కోట్ల రూపాయల పలు అభివృద్ధి పనులకు ప్రారంభం, శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ.49,040 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా శుక్రవారం మధ్యాహ్నం 3.25 నిమిషాలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. అమరావతి పనుల పునః ప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచి ప్రధాని మోదీ పాల్గొనే సభకు 5 లక్షల మంది హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సభకు 29 గ్రామాల ప్రజలు, రైతులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. గురువారం రాత్రి 10 గంటలకు సభా వేదిక వద్ద ఏర్పాట్లను మంత్రి నారాయణ మరోసారి పరిశీలించారు. నేటి కార్యక్రమాన్ని చూసేందుకు తరలి వచ్చే వారి కోసం 3531 ఆర్టీసీ బస్సులు, 4050 ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. దూరప్రాంతం నుంచి వచ్చే వాహనాలకు ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు.

అసలే వేసవికాలం కావడంతో ప్రధాని మోదీ సభకు వచ్చే వారి కోసం ఆహారం, తాగునీరు, ORS సిద్ధం చేశారు. మొత్తం 8 మార్గాల ద్వారా రాజధాని అమరావతి ప్రాంతానికి చేరుకునేలా రూట్ మ్యాప్ రూపొందించారు. 11 చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఒకవేళ నేడు అనుకోకుండా వర్షం పడినా, వచ్చిన ప్రజలు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ పార్కింగ్ ప్రాంతాలు కూడా అందుబాటులో ఉంచారు.

About the Author

raam ch

Administrator

Visit Website View All Posts

Post navigation

Previous: ఈ రోజు టెన్త్ పరీక్ష ఫలితాలు వెలువడున్నాయి.
Next: పెరిగిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మరింత ఈజీగా ఆస్థుల రిజిస్ట్రేషన్….!

Related News

నేను చనిపోయానని అనుకున్నా కానీ ఎలా బతికానో నమ్మలేకపోతున్న.
  • National News

నేను చనిపోయానని అనుకున్నా కానీ ఎలా బతికానో నమ్మలేకపోతున్న.

raam ch June 14, 2025 0
flight
  • National News

ఎయిర్ఇండియా విమానం AI 379 బాంబు బెదిరింపు.

raam ch June 13, 2025 0
gold
  • National News

మళ్లీ పెరిగిన బంగారం ధరలు కొనాలనుకునే వారికి షాక్ ఇస్తోంది…!

raam ch June 13, 2025 0

You may have missed

WhatsApp Image 2026-08-30 at 11.12.59 PM
  • Telangana News

బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

Admin September 1, 2026 0
WhatsApp-Image-2026-08-30-at-11.15.13-PM-1-1024x548.jpeg
  • Telangana News

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.

Admin September 1, 2026 0
WhatsApp Image 2026-08-30 at 11.17.36 PM
  • Telangana News

దేవరుప్పుల మండల కేంద్రంలో ముత్యాలమ్మ బోనాల వేడుకలు ఘనంగా… బోనం ఎత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి *

Admin September 1, 2026 0
536933fe-70f7-48a9-a2d5-5f756a2a8557
  • Telangana News

బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

Admin August 31, 2026 0
  • Facebook
  • Instagram
  • Twitter
  • Youtube
  • Linkedin
Copyright © All rights reserved. | MoreNews by AF themes.