
కొత్త విద్యుత్ కనెక్షన్లకు ఇకపై స్మార్ట్ మీటర్లు.. దశలవారీగా పాత కనెక్షన్లకు కూడా అమలు..
రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లకు ఇకపై స్మార్ట్ మీటర్లు మార్చేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
కొత్త కనెక్షన్లతో ప్రారంభించి, దశలవారీగా పాత కనెక్షన్లకు కూడా స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు ప్రణాళికలు..
ప్రతి నెల 30/31వ తేదీల్లో అర్ధరాత్రి రీడింగ్ తీసి వినియోగదారుడికి బిల్లు పంపించనున్న స్మార్ట్ మీటర్లు..
ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం తప్పనిసరిగా ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని నిర్ణయం..
సాధారణ మీటర్ల కంటే స్మార్ట్ మీటర్లకే ఎక్కువ ఖర్చు అవుతుందని, ఈ భారమంతా వినియోగదారుల నుంచే రాబట్టాలని డిస్కం సంస్థల ఆలోచన..!!

